Tuesday, 13 August 2019
Sunday, 11 August 2019
దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 4 వ సంచిక విడుదల
దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 4 వ సంచిక ( జూలై september 20 19 )
తేది : 11 -08 - 20 19 న
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల వారి ౩ వ ముద్రిత పుస్తకం
" హిందూ , ముస్లింల ఐక్యత వర్దిల్లాలి " లో మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి బోనగిరి రాజిరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం జరిగింది.
సాహిత్య పత్రిక కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
https://drive.google.com/file/d/1q_qp4HDI1JrqPOzWnbHyYNbhyQzL6oyt/view?usp=sharing
తేది : 11 -08 - 20 19 న
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల వారి ౩ వ ముద్రిత పుస్తకం
" హిందూ , ముస్లింల ఐక్యత వర్దిల్లాలి " లో మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి బోనగిరి రాజిరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం జరిగింది.
సాహిత్య పత్రిక కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
https://drive.google.com/file/d/1q_qp4HDI1JrqPOzWnbHyYNbhyQzL6oyt/view?usp=sharing
Monday, 10 June 2019
SHRI PADIMARRI VENKATA SUBBA RAO BIRTH ANNIVERSARY
పత్రిక ప్రకటన. ( తేదీ : జూన్ 9, 2019)
" భారత దేశం నా మాతృభూమి " ప్రతిజ్ఞ రచించిన తెలంగాణ వాసి పైడిమర్రి వెంకట సుబ్బారావు ను స్మరించుకున్న కవులు, ఉపాధ్యాయులు
జూన్ 10 న ప్రతిజ్ఞ రచయిత శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని ఈ రోజు దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమ సభను ఉద్దేశించి ప్రారంభ ప్రసంగం చేసిన సంఘ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత దేశంలో జనగణమన, వందేమాతరం తర్వాత జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ గల్గినది ప్రతిజ్ఞ అని గుర్తు చేశారు. అటువంటి ప్రతిజ్ఞను రచించిన తెలంగాణ వాసి, నల్గొండ నివాసి తెలంగాణ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసారని పేర్కొన్నారు.
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అప్పటి హైద్రాబాద్ రాష్ట్రంలో STO గా విధులు నిర్వహించారు. 1962 చైనా యుద్ధం సమయంలో విశాఖపట్నం లో విధులు నిరహిస్తున్నప్పుడు ప్రతిజ్ఞ రచించారు. దానిని కవి మిత్రులు తెన్నేటి విశ్వనాథం కు చూపించారు. వారి నుంచి విద్యాశాఖ మంత్రి Pv రాజు ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి చేరింది. 1963 లో పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞ అచ్చు అయింది. 1965 లో కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆంగ్లంలో కి అనువదించి పాఠ్య పుస్తకాలలో ముద్రించింది. కానీ ఎక్కడ రచయిత పేరు ముద్రించలేదు
2015 లో తెలంగాణ ప్రభుత్వం రచయిత పేరును పాఠ్య పుస్తకాలలో ముద్రించింది. పైడిమర్రి మంచి రచయిత, బహుభాషావేత్త.ఆయన కాలభైరవుడు నవల, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు లాంటి పద్యకావ్యాలు, బ్రహ్మచర్యం, గృహస్త జీవితం, స్త్రీ ధర్మం, తార, శ్రీమతి అనే నాటికలు రాసారు. వీరి పద్యాలు నల్గొండ కవుల సంచికలో ప్రచురితమైనవి. పైడిమర్రి 1971లో పదవి విరమణ పొంది ఆగస్ట్ 13, 1988 న మరణించారు.
కార్యక్రమం ముఖ్య అతిధిగా మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు బొడ్డు మహేందర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జాతీయ ప్రతిజ్ఞ ప్రజలలో దేశభక్తి ని పెంచుతుందని, అది రాసిన పైడిమర్రి సుబ్బారావు గారి జయంతి నిర్వహించడం చాల మంచి కార్యక్రమం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కవులు బండవరం రంగనాథ స్వామి, బొల్లావారం జగన్ మోహన్ రావు, జి. మహేందర్, సాగర్, పి.శ్రీనివాస్, బొడ్డు మహేందర్, పి.వేణుగోపాల్ రావు, మేసు మల్లేష్, మేకల రామస్వామి, బెల్లాల సుగుణాకర్ పాల్గొన్నారు.
సంఘ కార్యదర్శి జై కిషన్ ఓఝా, ఉపాధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్,
కోశాధికారి శీలo శ్రీనివాస్ రెడ్డి
పాల్గొన్నారు.
పైడిమర్రి వెంకట్ సుబ్బారావు గారి జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని, అతని పేరుపై తపాల బిళ్ళ.విడుదల చేయాలని కవులు కోరారు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
Wednesday, 29 May 2019
Saturday, 11 May 2019
Saturday, 27 April 2019
Monday, 18 March 2019
దేశభక్తి సాహిత్య పత్రిక విధి విధానాలు
PATRIOTS
WELFARE SOCIETY, MANCHERIAL
Dist:
MANCHERIAL, Telangana State, India
(Regd.no.446/2014)
దేశభక్తుల
సంక్షేమ సంఘం, మంచిర్యాల
“దేశభక్తి సాహిత్య ఈ పత్రిక ”
తేది: October 1,2018
కనుమరుగు
అవుతున్న దేశభక్తికి పునరుత్తేజం కలిగిoచాలనే
ఉద్దేశంతో మా దేశభక్తి ఈ పత్రికను ప్రారంభించాము . చరిత్ర అధ్యాపకులకు మా ప్రత్యేక
విన్నపం ఏమిటంటే మీరు మీ వంతుగా
జాతీయోద్యమ నాయకుల గురించి గాని, జాతీయోద్యమ సంఘటనల గురించి గాని మీరు గాని, మీ
విద్యార్ధుల చేత గాని రాయించి మా పత్రికకు పంపించ గలరు . తద్వారా మా ప్రయత్నానికి
మీ సహకారం యిచ్చిన వారు అవుతారు.
“ దేశభక్తి సాహిత్య ఈ-పత్రిక ”
డిసెంబర్
12,2018 నాటికి మా సంఘం ను స్థాపించి 4 సంవత్సరాలు కావస్తోంది. ఈ సదర్భంను
పురస్కరించుకొని మరియు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ రకమైన ఆర్దిక సహాయం
అందడం లేదు అనే చేదు నిజంను గ్రహించి ఒక “ ఈ త్రైమాసిక పత్రిక ” ప్రారంభించాలి
అనుకుంటున్నాము. ఆ పత్రిక పేరు “ దేశభక్తి సాహిత్య ఈ పత్రిక ”
వ్యాసాలు ఈ క్రింది అంశాలకు సంబంధించి ఉండాలి
౧. స్వాతంత్ర
సమర యోధుల ఆశయాలు, ఆదర్శాలు, వారి జీవితం, పోరాట విషయాలు
౨.సైనికుల
వీరోచిత త్యాగాలు, వారి వీర గాధలు
౩.మహాత్మా
గాంధీ సిద్ధాoతాలు, సత్యాగ్రహం, అహింస
4. పండిట్
జవహర్ లాల్ నెహ్రు ఆలోచన విధానం
5. భారత జాతి
ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు, సంస్థానాల విలీనం మరియు భారత జాతి
ఐక్యత కు బాబా సాహెబ్ అంబేద్కర్ అద్యక్షతన రూపొందిన రాజ్యాంగం చేసే కృషి
6. సుభాస్ చంద్ర బోస్ సైనిక విధానాలు
7. భగత్ సింగ్
, చంద్ర శేఖర్ ఆజాద్ మొదలైన విప్లవ వీరుల ఆలోచనలు, ఆదర్శాలు
8. లాల్,
పాల్, బాల్ అతివాదత్రయం వారి పోరాటాలు
9. స్వాతంత్ర పోరాటంలో
తెలుగు నాయకుల పాత్ర, వారి చరిత్ర, వారి వీరోచిత పోరాటాలు
10. తెలంగాణ విమోచన పోరాటం
11. మత సామరస్యమే భారతీయుల
మతం
12. భారత దేశ
సర్వతోముఖాభివృద్ధికి హిందూ, ముస్లింల ఐక్యత అత్యంత ఆవశ్యకం
13. భారత స్వాతంత్ర
సంగ్రామంలో పాల్గొన్న వివిధ సంఘాలు , వాటి పాత్ర
14.భారత స్వాతంత్ర
సంగ్రామంలో స్త్రీలు, వారి నిరుపమాన పాత్ర
15.భారత మాత, భాగ్య విధాత
16. దేశం ప్రస్తుతం
ఎదుర్కొంటున్న ప్రధాన రక్షణ, ఆర్దిక, రాజకీయ , సామాజిక సమస్యలు , పరిష్కార
మార్గాలు.
17. మతమా, దేశమా
18 . దేశభక్తిని
ప్రేరేపించే మరే అంశం అయినా
విధివిధానాలు :
౧.)ఇది ప్రముఖంగా త్రై మాసిక ఈ పత్రిక
౨) కాలెండర్ సంవత్సరం ను ఆధారంగా
చేసుకుంటుంది.
౩) మొదటి త్రై మాసికం – జనవరి,
ఫిబ్రవరి, మార్చి.
రెండవ త్రై మాసికం - ఏప్రిల్, మే, జూన్
మూడవ త్రై మాసికం – జూలై, ఆగష్టు,
సెప్టెంబర్
నాలుగవ త్రై మాసికం – అక్టోబర్ ,
నవంబర్ , డిసెంబర్
4) ప్రతి త్రై మాసికంలో మొదటి మాసంలో రచనలు పంపాలి, రెండవ మాసంలో పరిశీలన,
మూడవ మాసంలో ముద్రణ వుంటాయి
5) ఈ పత్రికలో ముద్రితమైన రచనల హక్కులు రచయితలకు సొంతం. మా సంస్థకు ముద్రిత
హక్కులు మాత్రం వుంటాయి. వాటికి కాలదోషం ఉండదు.
6) ప్రభుత్వాలను విమర్శించే రచనలు, కుల, మత విద్వేషాలు ప్రేరేపించే రచనలు ముద్రించబడవు
. ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం సమాజంను ప్రస్తుతం “ ఉన్న ” స్టితి నుంచి మరింత “ ఉన్నత
”స్థితికి తీసుకురావడం. అందువల్ల ఈ ప్రధాన లక్ష్యానికి విరుద్ధంగా ఉన్న రచనలు
ముద్రించబడవు.
7) పరుష పదజాలం వాడ రాదు.
8) మేజర్లు అయినా ప్రతి ఒక్కరికి రాసే అవకాశం వుంటుంది.
9) ప్రతి రచనతో రచయితా పేరు, పూర్తీ చిరునామా, మెయిల్ ఐ డి పంపాలి
10) రచనలు సొంత రచన అని హామీ ఇవ్వాలి
11) మాకు పంపిన రచనలు ముద్రించడం మా విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది
12) ఈ పత్రికపై వివాదాలు రావు అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే వివాదాస్పద
అంశాలు ముందే తొలగించబడతాయి. అయినా వివాదాలు మంచిర్యాల న్యాయస్థానంల పరిధిలోకి
వస్తాయి.
13) పద్య
కవిత్వం A 4 సైజు పేజిలో ౩ వంతు ఉండాలి, వచన కవిత్వం, గీతాలు A 4 సైజు పేజి
ఉండవచ్చు. కథలు, వ్యాసాలు 2 A 4 సైజు
పేజీలు ఉండవచ్చు.
టెక్నికల్ అంశాలు
:
౧) రచనలు MS WORD లో పంపాలి లేదా మెయిల్ లో నేరుగా టైపు చేసి పంపవచ్చు
౨) A 4 సైజు పేజిలో అన్ని వైపులా 1 మార్జిన్ వదిలి టైప్ చెయ్యాలి
౩) రచనలు UNIFONT లోనే ఉండాలి
4) రచయితలు తెలుగు బాష అభ్యర్ధులు అయితే ఒకటికి రెండు సార్లు PROOF READ చేసి
పంపాలి , తెలుగు బాష అభ్యర్ధులు కాకపొతే
తెలుగు బాష అభ్యర్ధులతో ప్రూఫ్ రీడ్ చేసిన తర్వాత మాత్రమే పంపాలి.
5) రచనలు మా ఈ మెయిల్ ఐ డి కి మాత్రమే పంపాలి
6) త్రై మాసికం లోని మెదటి
మాసంలో మాత్రమే రచనలు పంపాలి. తర్వాత, ముందు పంపిన రచనలు అంగీకరించబడవు
ప్రకటన జారి చేసిన వారు
సూది రెడ్డి నరేందర్ రెడ్డి
అద్యక్షులు
దేశభక్తుల సంక్షేమ సంఘం ,
మంచిర్యాల
అదనపు అంశాలు
౧. రచనలు యునిఫాంట్ లోనే
పంపాలి
౨. కవితలు, గీతాలు 20 -25
లైన్లు ఉండాలి. వ్యాసాలు ౩ పేజీల వరకు ఉండవచ్చు.
౩. ఒక రచయితకు ఒక రచన
మాత్రమే సంచికలో ముద్రించబడుతుంది.
4. రచన, రచయిత పోటో , ఇంటి
నెంబర్, పిన్ కోడ్, సెల్ నెంబర్ తో కూడిక చిరునామా వివరాలు ఒకేసారి మెయిల్ కు
పంపాలి. ఒక సారి రచన, ఒక సారి పోటో, ఒకసారి అడ్రస్ పంపరాదు. మెయిల్ ఐ.డి.
5. రచనలు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలలో
మాత్రమే పంపాలి. ఆ నెలలలో ఒకటవ తేది నుంచి చివరి తేది వరకు వచ్చిన రచనలు మాత్రమే పరిశిలించబడుతాయి.
6. ఒక సంచికకు గరిష్ట
పేజీలు 100 మాత్రమే .
================================================================
Saturday, 9 March 2019
Subscribe to:
Posts (Atom)



































