Saturday 19 September 2020

దేశభక్తి సాహిత్య భాస్కర , దేశభక్తి సాహిత్య సేవా భాస్కర బిరుదులు ప్రధానం

 దేశభక్తుల సంక్షేమ సంఘం : తెలంగాణ 

జిల్లా : మంచిర్యాల ( నమోదు సంఖ్య 446/2014)

PATRIOTS WELFARE SOCIETY : TELANGANA

DIST: MANCHERIAL ( Regd.no.446/2014)


" కవులకు " దేశభక్తి  సాహిత్య భాస్కర ,

 సంపాదకులకు " దేశభక్తి సాహిత్య  సేవా భాస్కర " బిరుదులు ప్రధానం "

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ప్రధాన లక్ష్యం  " జాతీయ ఐక్యత, జాతీయ సమైక్యత , జాతీయత, దేశభక్తి " ప్రచారం చేయడం.  ఈ లక్ష్య సాధనలో భాగంగా సంఘం " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " ను అక్టోబర్ 2018 లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి 3 నెలలకు ఒక్కసారి విడుదల అయ్యే ఈ పుస్తకం . ప్రధానంగా దేశభక్తి రచనలు కలిగి ఉంటుంది. 2018 నుంచి ఇప్పటి వరకు " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " కు అనేక మంది కవులు వారి వారి రచనలు నిస్వార్థంతో పంపండి జరిగింది.


వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశ్యంతో 10 సంచికలు, 3 ప్రత్యేక సంచికలకు రచనలు పంపిన కవులకు " దేశభక్తి సాహిత్య భాస్కర " బిరుదును ప్రధానం చేస్తున్నాము. వారి పేర్లు 

1) శింగారాజు శ్రీనివాస్ రావ్ , ఒంగోలు 

2) వెంకట లక్ష్మి గాయత్రీ , విజయనగరం 

3) సయ్యద్ జహీర్ అహ్మద్ , కర్నూలు 

4) ఐ .వి. సుబ్బాయమ్మ , లక్షెట్ పెట్ 

5) కొప్పుల ప్రసాద్ , నంద్యాల 

6) ఆత్రం మోతీరాం , ఉట్నూర్ 

7) వురిమళ్ళ సునంద , ఖమ్మం 

8) కుడికాల జనార్దన్ , వరంగల్ 

9) రాంపల్లి శైలజ , హైదరాబాద్ 

10) ఆకుల మల్లికార్జున్ , షాద్ నగర్ 

11) డా. రామాక కృష్ణ మూర్తి,  సికింద్రాబాద్ 

12) డా. వీపూరి వెంకటేశ్వర్లు , కర్నూల్ 

13) కిలపర్తి దాలినాయుడు , విశాఖపట్నం 

14) సందుపట్ల మధు , హన్మకొండ 

15) డా. దేవులపల్లి పద్మజ , విశాఖపట్నం 

16) జక్కు కృష్ణ మూర్తి గౌడ్ , వరంగల్ 

17) దొంతరాజు విజయలక్ష్మి , కరీంనగర్ 

వీరితో పాటు 10 సంచికలకు , ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహిస్తున్న వారికి " దేశభక్తి సాహిత్య సేవా భాస్కర " బిరుదులు ప్రధానం చేస్తున్నాము. వారి పేర్లు 

1) సూదిరెడ్డి నరేందర్ రెడ్డి , మంచిర్యాల 

2) జై కిషన్ ఓఝా , మంచిర్యాల 

3) అల్లాడి శ్రీనివాస్ , మంచిర్యాల 

4) డా తన్నీరు సురేష్, ధర్మపురి 

5) దార్శెట్టి  లక్ష్మి నరసింహం , సిర్పూర్ కాగజ్ నగర్ 

6) వింధ్య వాసిని దేవి, హైదరాబాద్ 

7)సందుపట్ల మధు, హన్మకొండ 

8) వీపూరి వెంకటేశ్వర్లు , కర్నూలు 

వారికి బిరుదు పత్రాలు డిజిటల్ రూపంలో యివ్వడం జరుగుతుంది .


సూదిరెడ్డి నరేందర్ రెడ్డి 

అధ్యక్షులు 

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల

Date : 20-09-2020 

======================================================= 


Tuesday 15 September 2020

PATRIOTS WELFARE SOCIETY , TELAGANA ( MANCHERIAL) - NATIONAL LEVEL ONLINE DRAWING COMPETITION FOR HIGH SCHOOL STUDENTS 2020 - LAST DATE OCTOBER 2,2020 -

 PATRIOTS WELFARE SOCIETY , TELAGANA ( MANCHERIAL) - NATIONAL LEVEL ONLINE DRAWING COMPETITION FOR HIGH SCHOOL AND COLLEGE STUDENTS 2020 - LAST DATE OCTOBER 2,2020 -

 

painting must be on Mahatma Gandhi or his role in Indian independence


1) Students must draw with their own articles 

2) students must mention their name and class, district and state  on their painting 

3) they must upload photograph of painting 

4) only to those students who uploaded drawing, we will sent a certificate form to their mail id. they can  fill form and get certificate

5) There is no cash prize

6) First , second , third drawing are provided with  special appreciation certificates

7) Students all over India can participate

8) We reserve right to use your drawing for our society purposes


S.NARENDAR REDDY 

President

Patriots welfare society, Telangana ( Mancherial)

patriotswelfaresociety@gmail.com


and


Jai Kishan Ojha

General Secretary 


Click below form and fill your data to participate


https://forms.gle/LKLc8V7vbHddW79c7


============================================================== 

జాతిపితకు జేజేలు ఆన్లైన్ కవి సమ్మేళనం కు నమోదు చేసుకోండి

 ఈ జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం నిర్వహణలో పాల్గొంటున్న సాహిత్య సంఘాలు 


1) దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ 

2) భువన సాహిత్య విజ్ఞాన వేదిక, తెలంగాణ 

3) తెలంగాణ వివేక రచయితల సంఘం , తెలంగాణ 

4) ఉట్నూర్ సాహితీ వేదిక, ఉట్నూర్ 

5) తెలంగాణ సామాజిక రచయితల సంఘం, మహబూబాబాద్ జిల్లా 


జాతిపితకు జేజేలు - జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం అక్టోబర్ 2,2020 న పైన పేర్కొన్న అన్ని సంఘాలు కలిపి 

నిర్వహిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాము  


ఈ కవి సమ్మేళనం అక్టోబర్ 2,2020 న గూగుల్ మీట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.

పాల్గొనే ఆసక్తి ఉన్న కవులు ఈ ఫామ్ లో వారి వివరాలతో పాటు మహాత్మా గాంధీ గారిపై కవితను కూడా ఇందులో రాయాలి . 


కవి పేరు, కవితా శీర్షిక, కవిత, చిరునామా ఈ క్రమ పద్దతిలో కవిత ఉండాలి. 


పాల్గొన్న కవులకు ఈ -ప్రశంసా పత్రం యివ్వడం జరుగుతుంది. కవిత రాయడంతో పాటు ఆన్లైన్ కవి సమ్మేళనం లో పాల్గొనడం తప్పనిసరి 


ఇట్లు 

సాహిత్య సంఘాల అధ్యక్ష ,కార్యదర్శులు  

========================================================= 


https://docs.google.com/forms/d/e/1FAIpQLScATyKoDbghlCDIyCdjze8LdxQAjtgGtPjP44driCCSSCFPuw/viewform?usp=sf_link


=============================================================== 

Sunday 6 September 2020

" రవీంద్రనాథ్ టాగోర్ పై జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహణ "

 తేదీ 06-09-2020

దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ (మంచిర్యాల )

" పత్రిక ప్రకటన "

" రవీంద్రనాథ్ టాగోర్ పై జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహణ "

" రవీంద్రనాథ్ టాగోర్ జీవితం, సాహిత్యం పై " జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనం " ను ఐదు సాహితీ సంస్థలు కలిసి నిర్వహించినట్టు కవి సమ్మేళన అధ్యక్షుడు మరియు దేశభక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షలు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు .

ఐదు సాహితీ సంఘాలు 1) దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల 2) శరత్ సాహితీ కళా స్రవంతి , కరీంనగర్ 3) ఉదయ సాహితి , కరీంనగర్ 4) భువన విజ్ఞాన సాహిత్య వేదిక , తెలంగాణ 5) ఉట్నూర్ సాహితి వేదిక, ఉట్నూర్ తలపెట్టిన " రవీంద్రనాథ్ టాగోర్ జయంతి వేడుకలు 2020 " కరోనా కారణంగా రద్దు కావడంతో ఈ ఆన్లైన్ కవి సమ్మేళనం నిర్వహించినట్టు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.

ఈ జాతీయ అంతర్జాల కవి సమ్మేళనం ముఖ్య అతిధిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ శ్రీ దార్ల వెంకటేశ్వర్ రావ్ గారు పాల్గొన్నారు . వారు మాట్లాడుతూ ఠాగూర్ జీవితంపై కవి సమ్మేళనం నిర్వహించడం మంచి కార్యక్రమం అని , కవులు అందరిని కలుపుకు పోయే విశాల వేదిక అవసరం అని పేర్కొన్నారు. 5 సంఘాలు కలిసి కవి సమ్మేళనం నిర్వహించడం గొప్ప కార్యక్రమం అని అభినందించారు.

దేశాన్ని ప్రేమించడం, దేశ భౌగోళిక పరిస్థితులను ప్రేమించడం అనేది చర్చనీయా అంశం అని, అయితే దేశ భౌగోళిక పరిస్థితులను ప్రేమించలేని వారు దేశాన్ని ప్రేమించలేరని తెలిపారు. మన దేశం విస్తృత సాహిత్యం స్పృష్టించిందని రామాయణ, మహాభారతాలు అందులో భాగాలని , ఆ స్థాయిలో మళ్ళి సాహిత్యం ను రవీంద్రనాథ్ ఠాగోర్ గారు స్పృష్టించారని తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలను కలుపుకుపోయే విధంగా రవీంద్రనాథ టాగోర్ గారు రచించిన జాతీయ గీతం " జన,గణ మన " ఉందని అందుకే దానిని జాతీయ గీతంగా ఆమోదించారని తెలిపారు. రవీంద్రనాథ్ టాగోర్ జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని , మాతృ భాషను విస్మరించకుండా పర భాషలు కూడా నేర్చుకోవాలని టాగోర్ జీవితం సూచిస్తున్నాడని తెలిపారు. మనకు ఉండే స్వేచ్ఛ ను యితరులు కోరుకుంటారని రవీంద్రనాథ్ టాగోర్ వారి సాహిత్యంలో సూచించారని తెలిపారు. టాగోర్ రాసిన నవలలో ఘోర నవల ప్రసిద్ధమైనది తెలిపారు. విశాల మానవుడు ఉద్బవించానలి టాగోర్ కోరుకున్నారని, భిన్న భాషలు దేశ సమైక్యతకు అవసరం అని వారు తెలిపారు. మాధుర్యం కవిత్వానికి ముఖ్యమని, కవిత్వంలో కవిత్వం మాత్రమే కనిపించాలని కవి కాదని అన్నారు. సంస్కృతీ అంటే ఎప్పటికప్పుడు సంస్కరించేబడేదని టాగోర్ పేర్కొన్నారని తెలిపారు.

ఈ కవి సమ్మేళనం కు విశిష్ట అతిధిగా ఢిల్లీ విశ్వవిద్యాలయం కు చెందిన డా. గంపా వెంకట రామయ్య గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ టాగోర్ సాహిత్యం గురించి మాట్లాడాలంటే అంత పరిజ్ఞానం ఉండాలని, కానీ సాహిత్య విద్యార్థిగా రవీంద్రుని కవితాలపై చర్చిస్తున్నాని తెలిపారు. రవీంద్రనాథ్ టాగోర్ రచనలు చాలా వరకు తెలుగులోకి అనువదించబడ్డాయని తెలిపారు. విశ్వసాహిత్యం, నేషనలిజం పేరుతొ వచ్చిన రెండు పత్రాలపై వారు మాట్లాడారు. విశ్వ సాహిత్యం విశ్వ శ్రేయస్సు ను కోరుతుందని, అది మాత్రమే సాహిత్యం అని పేర్కొన్నారు. ఈ భూభాగం ప్రపంచం అంతా కలిసి ఉన్న ఉన్న భాగమని ముక్కలు, ముక్కలు అయిన భాగం కాదని టాగోర్ అనే వారిని తెలిపారు. విశ్వసాహిత్యానికి అనువాదం చేయదగ్గ అర్హత, మరియు ప్రాంతానికి, కాలానికి అతీతంగా ఉండే అర్హత ఉండాలని తెలిపారు.

ఈ కవి సమ్మేళన గౌరవ అతిధులుగా సబ్బాని లక్ష్మి నారాయణ ( కరీంనగర్ ) , వైరాగ్యం ప్రభాకర్ ( కరీంనగర్ ) , గోస్కుల రమేష్ ( హుజురాబాద్ ) , జాదవ్ బంకట్ లాల్ ( ఉట్నూర్ ) వ్యవహరించారు.

ఆత్మీయ అతిధులుగా జై కిషన్ ఓఝా ( మంచిర్యాల ) , సంకెపల్లి నాగేంద్ర శర్మ ( కరీంనగర్ ), బి వి యెన్ శర్మ ( కరీంనగర్ ), మంచికట్ల శ్రీనివాస్ ( వరంగల్ ), కొండగుర్ల లక్ష్మయ్య ( ఉట్నూర్ ) వ్యవహరించారు.

ప్రత్యేక అతిధిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని కి చెందిన తెలుగు విభాగం అధిపతి తన్నీరు సురేష్ గారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా కవులు పాల్గొన్నారు.

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

అధ్యక్షుడు

దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల