Tuesday 29 October 2019

SARDAR VALLABAI PATEL JAYANTHI 2019

పత్రిక ప్రకటన
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
ఈ రోజు దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆద్వర్యంలో ముందస్తుగా సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ( జయంతి అక్టోబర్ 31) ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా వచ్చిన గోదావరిఖని ప్రభుత్వ డిగ్రి కళాశాల ఆసిస్టెంట్ ప్రొపెసర్ డా. తన్నీరు సురేష్ గారు భారత దేశానికి సర్దార్ వల్లబాయ్ పటేల్ అందించిన సేవలు వివరించారు. భారతదేశ భౌగోళిక సమైక్యత కి వారు చేసిన కృషి గొప్పదని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షులు శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ నాయకులలో ఉక్కుమనిషి గా పేరు తెచ్చుకొని యువతకుఅదర్శంగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వాకేట్ మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ బొడ్డు మహేందర్ గారు కార్యదర్శి శ్రీ మేకల రామస్వామి గారు ప్రముఖ కవులు బెల్లాల సుగుణాకర్ పెంచాల శ్రీనివాస్ అల్లాడి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడుతూ కవి సమ్మేళనం నిర్వహించారు.
కార్యక్రమంలో ఫిబ్రవరి 2019 న నిర్వహించిన జాతీయ స్థాయి కవి సమ్మేళనం లో వచ్చిన
54 కవితలతో కూడిన " స్వాతంత్య్ర భారతికి సాహిత్య హరతి" ఈ పుస్తకం ముఖ్య అతిధి , డా.తన్నీరు సురేశ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శీలo శ్రీనివాస్ రెడ్డి, ఓఝా పాల్గొన్నారు.
ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల





Wednesday 2 October 2019

JATIPITA MAHATMA GANDHI 150 BIRTH ANNIVERSARY AND LAL BAHADUR SHASTRI BIRTH ANNIVERSARY

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
పత్రిక ప్రకటన
తేదీ : అక్టోబర్ 2, 2019
"జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు "
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా గాంధీ 150 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంను పురస్కరించుకుని మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు. అదే విధంగా ఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినమును పురస్కరించుకుని వారి చిత్ర పటానికి కూడా పూలమాల తో ఘన నివాళ్ళు అర్పించారు.
తదుపరి
" మహాత్ముడే మానవాళికి మార్గ దర్శకుడు "
అనే అంశంపై కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనం ప్రారంభ ఉపాన్యాసం చేసిన సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్ముని అహింసా, సత్యాగ్రహాలు ఎప్పటికైనా ఆచరణీయమేనని పేర్కొన్నారు. విప్లవ, అతివాద భావజాలం కూడా కరుడుగట్టిన బ్రిటిష్ వారిని వణికించలేక పొయిందని కానీ మహాత్ముని సత్యాగ్రహ ఉద్యమం బ్రిటిష్ వారిని భారత దేశం విడిచి వెళ్లేలా చేసిందని దానికి కారణం గాంధీజీని దేశప్రజలు అందరూ అనుసరించడమేనని.
నాయకుని లక్షణం ప్రజల నుంచి రావడం, ప్రజల కొరకు పని చేయడమేనని తెలిపారు.
నేటి రాజకీయ వ్యవస్థ, ఉద్యమకారులు మహాత్ముని అహింసా సిద్ధాంతం గూర్చి తెలుసుకోవలసింది ఎంతో ఉందని పేర్కొన్నారు.
తర్వాత ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా వచ్చిన గుండేటి యోగేశ్వర్ గారు పాల్గొని మహాత్మ గాంధీ ఆశయాలను, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ లాంటి అంశాల గురించి విరివిగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో కవులు బండవరం రంగనాథ స్వామి, రాజేశం గౌడ్, మేసు మల్లేశం, పోటు హైమవతి, అల్లాడి శ్రీనివాస్, పిస్క సత్యనారాయణ గారు, బెల్లాల సుగుణాకర్ గారు,సంఘ కార్యవర్గ సభ్యులు మేడ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
( ఫొటోలో కనిపించే సంచులు ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ ప్రేమికుడు గుండేటి యోగేశ్వర్ కి చెందినవి. వారు స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడడమే కాకుండా ప్లాస్టిక్ బదులు సంచులు వాడాలని తెలిపారు)







Friday 20 September 2019

" తెలంగాణ విలీన వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు " మంచిర్యాల జిల్లా కవి సమ్మేళనం

SEPTEMBER 17 ను పురస్కరించుకొని
" తెలంగాణ విలీన వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు "
పేరుతొ మంచిర్యాల జిల్లా స్తాయి కవి సమ్మేళనం
తేది : 14-09-20 19













PEDDAPALLY DISTRICT LEVEL POETRY CONFERENCE ON SALUTATIONS TO MARTYRED SOLIDIERS

PEDDAPALLY DISTRICT LEVEL POETRY CONFLUENCE ON SALUTATIONS TO MARTYRED SOLDIERS

Memorizing soldiers sacrificed their lives in URI attack, we conducted this programme on 15-09-2019












Saturday 7 September 2019

పత్రికా ప్రకటన.    

పెద్దపల్లి జిల్లా స్థాయి కవి సమ్మేళనం

అంశం : అమర జవాన్లకు అక్షరాంజలి

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15, 2019
 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి " అమర జవాన్లకు అక్షరాంజలి " పేరుతో " 
పెద్దపల్లి జిల్లా స్థాయి కవి సమ్మేళనం " నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,
 ప్రధాన కార్యదర్శి జై కిషన్ ఓఝా తెలిపారు.

ఈ కవి సమ్మేళనం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని లో నిర్వహించడం జరుగుతుంది.
సెప్టెంబర్ 18, 2016 జమ్మూకాశ్మీర్ ఉరి ప్రాంతంలో జరిగిన దాడిలో మరణించిన
 సైనికులను స్మరిస్తూ ఈ కవి సమ్మేళనం ఉంటుందని తెలిపారు.
ఈ కవి సమ్మేళనం లో పాల్గొనే కవులకు ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుంది. 
పాల్గొనే కవులు సంప్రదించండి 

ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల

మంచిర్యాల జిల్లా స్థాయి కవి సమ్మేళనం

పత్రికా ప్రకటన.    తేదీ : 04-09-2019
మంచిర్యాల జిల్లా స్థాయి కవి సమ్మేళనం

అంశం : తెలంగాణ విలీన వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14, 2019 శనివారం ఉదయం 10 గంటల 
నుంచి "  తెలంగాణ విలీన  వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు " పేరుతో " మంచిర్యాల జిల్లా స్థాయి 
కవి సమ్మేళనం " నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,
 ప్రధాన కార్యదర్శి జై కిషన్ ఓఝా తెలిపారు.

 ఈ కవి సమ్మేళనం అధ్యక్షుడు గృహం ఆదిత్య నిలయం, ఇంటి నెంబర్ 20-183/4, ఎడ్లవాడ, కాలేజ్ రోడ్డు , 
మంచిర్యాల లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కవి సమ్మేళనం లో పాల్గొనే కవులకు ప్రశంసా పత్రాలు
, జ్ఞాపికలు అందించడం జరుగుతుంది. పాల్గొనే కవులు సంప్రదించండి

ఇట్లు

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
===================================


Tuesday 13 August 2019

హిందూ ముస్లింల ఐక్యత వర్దిల్లాలి పుస్తక ఆవిష్కరణ

తేది 11 -08 -20 19
న దేశభక్తుల సంక్షేమ సంఘం ముద్రించిన 3 వ ముద్రిత పుస్తకం ను మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి శ్రీ ముత్యబోయిన మలయ శ్రీ గారు ఆవిష్కరించారు . ఆ దృశ్యాలు






బాలగంగాదర్ తిలక్ , చంద్ర శేఖర్ ఆజాద్ మరియు దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలు 20 19


బాలగంగాదర్ తిలక్ ,  చంద్ర శేఖర్ ఆజాద్ మరియు దాశరథి కృష్ణమాచార్య  జయంతి  వేడుకలు 20 19  మరియు హన్మకొండకు చెందిన కవి శ్రీ చేరాల రాజ శేఖర్ గారి పుస్తక ఆవిష్కరణ .







Sunday 11 August 2019

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 4 వ సంచిక విడుదల

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 4 వ సంచిక ( జూలై september 20 19 )
తేది : 11 -08 - 20 19 న
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల వారి ౩ వ ముద్రిత పుస్తకం
" హిందూ , ముస్లింల ఐక్యత వర్దిల్లాలి " లో మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి బోనగిరి రాజిరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం జరిగింది.

సాహిత్య పత్రిక కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.

https://drive.google.com/file/d/1q_qp4HDI1JrqPOzWnbHyYNbhyQzL6oyt/view?usp=sharing





Monday 10 June 2019

SHRI PADIMARRI VENKATA SUBBA RAO BIRTH ANNIVERSARY

పత్రిక ప్రకటన. ( తేదీ : జూన్ 9, 2019)
" భారత దేశం నా మాతృభూమి " ప్రతిజ్ఞ రచించిన తెలంగాణ వాసి పైడిమర్రి వెంకట సుబ్బారావు ను స్మరించుకున్న కవులు, ఉపాధ్యాయులు
జూన్ 10 న ప్రతిజ్ఞ రచయిత శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని ఈ రోజు దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమ సభను ఉద్దేశించి ప్రారంభ ప్రసంగం చేసిన సంఘ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత దేశంలో జనగణమన, వందేమాతరం తర్వాత జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ గల్గినది ప్రతిజ్ఞ అని గుర్తు చేశారు. అటువంటి ప్రతిజ్ఞను రచించిన తెలంగాణ వాసి, నల్గొండ నివాసి తెలంగాణ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసారని పేర్కొన్నారు.
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అప్పటి హైద్రాబాద్ రాష్ట్రంలో STO గా విధులు నిర్వహించారు. 1962 చైనా యుద్ధం సమయంలో విశాఖపట్నం లో విధులు నిరహిస్తున్నప్పుడు ప్రతిజ్ఞ రచించారు. దానిని కవి మిత్రులు తెన్నేటి విశ్వనాథం కు చూపించారు. వారి నుంచి విద్యాశాఖ మంత్రి Pv రాజు ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి చేరింది. 1963 లో పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞ అచ్చు అయింది. 1965 లో కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆంగ్లంలో కి అనువదించి పాఠ్య పుస్తకాలలో ముద్రించింది. కానీ ఎక్కడ రచయిత పేరు ముద్రించలేదు
2015 లో తెలంగాణ ప్రభుత్వం రచయిత పేరును పాఠ్య పుస్తకాలలో ముద్రించింది. పైడిమర్రి మంచి రచయిత, బహుభాషావేత్త.ఆయన కాలభైరవుడు నవల, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు లాంటి పద్యకావ్యాలు, బ్రహ్మచర్యం, గృహస్త జీవితం, స్త్రీ ధర్మం, తార, శ్రీమతి అనే నాటికలు రాసారు. వీరి పద్యాలు నల్గొండ కవుల సంచికలో ప్రచురితమైనవి. పైడిమర్రి 1971లో పదవి విరమణ పొంది ఆగస్ట్ 13, 1988 న మరణించారు.
కార్యక్రమం ముఖ్య అతిధిగా మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు బొడ్డు మహేందర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జాతీయ ప్రతిజ్ఞ ప్రజలలో దేశభక్తి ని పెంచుతుందని, అది రాసిన పైడిమర్రి సుబ్బారావు గారి జయంతి నిర్వహించడం చాల మంచి కార్యక్రమం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కవులు బండవరం రంగనాథ స్వామి, బొల్లావారం జగన్ మోహన్ రావు, జి. మహేందర్, సాగర్, పి.శ్రీనివాస్, బొడ్డు మహేందర్, పి.వేణుగోపాల్ రావు, మేసు మల్లేష్, మేకల రామస్వామి, బెల్లాల సుగుణాకర్ పాల్గొన్నారు.
సంఘ కార్యదర్శి జై కిషన్ ఓఝా, ఉపాధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్,
కోశాధికారి శీలo శ్రీనివాస్ రెడ్డి
పాల్గొన్నారు.

పైడిమర్రి వెంకట్ సుబ్బారావు గారి జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని, అతని పేరుపై తపాల బిళ్ళ.విడుదల చేయాలని కవులు కోరారు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల