Wednesday 2 October 2019

JATIPITA MAHATMA GANDHI 150 BIRTH ANNIVERSARY AND LAL BAHADUR SHASTRI BIRTH ANNIVERSARY

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
పత్రిక ప్రకటన
తేదీ : అక్టోబర్ 2, 2019
"జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు "
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా గాంధీ 150 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంను పురస్కరించుకుని మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు. అదే విధంగా ఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినమును పురస్కరించుకుని వారి చిత్ర పటానికి కూడా పూలమాల తో ఘన నివాళ్ళు అర్పించారు.
తదుపరి
" మహాత్ముడే మానవాళికి మార్గ దర్శకుడు "
అనే అంశంపై కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనం ప్రారంభ ఉపాన్యాసం చేసిన సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్ముని అహింసా, సత్యాగ్రహాలు ఎప్పటికైనా ఆచరణీయమేనని పేర్కొన్నారు. విప్లవ, అతివాద భావజాలం కూడా కరుడుగట్టిన బ్రిటిష్ వారిని వణికించలేక పొయిందని కానీ మహాత్ముని సత్యాగ్రహ ఉద్యమం బ్రిటిష్ వారిని భారత దేశం విడిచి వెళ్లేలా చేసిందని దానికి కారణం గాంధీజీని దేశప్రజలు అందరూ అనుసరించడమేనని.
నాయకుని లక్షణం ప్రజల నుంచి రావడం, ప్రజల కొరకు పని చేయడమేనని తెలిపారు.
నేటి రాజకీయ వ్యవస్థ, ఉద్యమకారులు మహాత్ముని అహింసా సిద్ధాంతం గూర్చి తెలుసుకోవలసింది ఎంతో ఉందని పేర్కొన్నారు.
తర్వాత ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా వచ్చిన గుండేటి యోగేశ్వర్ గారు పాల్గొని మహాత్మ గాంధీ ఆశయాలను, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ లాంటి అంశాల గురించి విరివిగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో కవులు బండవరం రంగనాథ స్వామి, రాజేశం గౌడ్, మేసు మల్లేశం, పోటు హైమవతి, అల్లాడి శ్రీనివాస్, పిస్క సత్యనారాయణ గారు, బెల్లాల సుగుణాకర్ గారు,సంఘ కార్యవర్గ సభ్యులు మేడ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
( ఫొటోలో కనిపించే సంచులు ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ ప్రేమికుడు గుండేటి యోగేశ్వర్ కి చెందినవి. వారు స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడడమే కాకుండా ప్లాస్టిక్ బదులు సంచులు వాడాలని తెలిపారు)







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.