Tuesday 29 October 2019

SARDAR VALLABAI PATEL JAYANTHI 2019

పత్రిక ప్రకటన
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
ఈ రోజు దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆద్వర్యంలో ముందస్తుగా సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ( జయంతి అక్టోబర్ 31) ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా వచ్చిన గోదావరిఖని ప్రభుత్వ డిగ్రి కళాశాల ఆసిస్టెంట్ ప్రొపెసర్ డా. తన్నీరు సురేష్ గారు భారత దేశానికి సర్దార్ వల్లబాయ్ పటేల్ అందించిన సేవలు వివరించారు. భారతదేశ భౌగోళిక సమైక్యత కి వారు చేసిన కృషి గొప్పదని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షులు శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ నాయకులలో ఉక్కుమనిషి గా పేరు తెచ్చుకొని యువతకుఅదర్శంగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వాకేట్ మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ బొడ్డు మహేందర్ గారు కార్యదర్శి శ్రీ మేకల రామస్వామి గారు ప్రముఖ కవులు బెల్లాల సుగుణాకర్ పెంచాల శ్రీనివాస్ అల్లాడి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడుతూ కవి సమ్మేళనం నిర్వహించారు.
కార్యక్రమంలో ఫిబ్రవరి 2019 న నిర్వహించిన జాతీయ స్థాయి కవి సమ్మేళనం లో వచ్చిన
54 కవితలతో కూడిన " స్వాతంత్య్ర భారతికి సాహిత్య హరతి" ఈ పుస్తకం ముఖ్య అతిధి , డా.తన్నీరు సురేశ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శీలo శ్రీనివాస్ రెడ్డి, ఓఝా పాల్గొన్నారు.
ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.