Saturday 7 September 2019

పత్రికా ప్రకటన.    

పెద్దపల్లి జిల్లా స్థాయి కవి సమ్మేళనం

అంశం : అమర జవాన్లకు అక్షరాంజలి

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15, 2019
 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి " అమర జవాన్లకు అక్షరాంజలి " పేరుతో " 
పెద్దపల్లి జిల్లా స్థాయి కవి సమ్మేళనం " నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,
 ప్రధాన కార్యదర్శి జై కిషన్ ఓఝా తెలిపారు.

ఈ కవి సమ్మేళనం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని లో నిర్వహించడం జరుగుతుంది.
సెప్టెంబర్ 18, 2016 జమ్మూకాశ్మీర్ ఉరి ప్రాంతంలో జరిగిన దాడిలో మరణించిన
 సైనికులను స్మరిస్తూ ఈ కవి సమ్మేళనం ఉంటుందని తెలిపారు.
ఈ కవి సమ్మేళనం లో పాల్గొనే కవులకు ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుంది. 
పాల్గొనే కవులు సంప్రదించండి 

ఇట్లు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.